Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.7,000లకు నెల రోజుల మగ శిశువును అమ్మేశారు..!

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (09:21 IST)
జైపూర్, జాజ్‌పూర్ జిల్లాలోని దశరథపూర్ ప్రాంతంలో సంతానం లేని దంపతులకు రూ.7,000లకు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల వయస్సు గల బాలుడిని జాజ్‌పూర్ పోలీసులు మంగళవారం కాపాడారు. సోమవారం తన బిడ్డను రక్షించాలంటూ పాప తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
బిక్రమ్ ముండా, అతని భార్య జంగా ముండా బిరాజా దేవాలయం ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్నారని.. రోజువారీ కూలీ పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు అప్పటికే ఒక కుమార్తె సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. జంగా గత నెలలో మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
దీంతో దంపతులు సోమవారం జాజ్‌పూర్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. దీంతో పోలీసులు చిన్నారిని రక్షించాల్సిందిగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ)కి సమాచారం అందించారు. పోలీసులు, డిసిపిఓ, చైల్డ్‌లైన్ అధికారుల బృందం మంగళవారం హలాదిపాడు గ్రామానికి వెళ్లి చిన్నారిని రక్షించారు. 
 
"శిశువు ప్రస్తుతం స్థానిక చైల్డ్‌లైన్ అదుపులో ఉంది. పోలీసులు కేసును విచారిస్తున్నారని" చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ బరేంద్ర కృష్ణ దాస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments