Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.7,000లకు నెల రోజుల మగ శిశువును అమ్మేశారు..!

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (09:21 IST)
జైపూర్, జాజ్‌పూర్ జిల్లాలోని దశరథపూర్ ప్రాంతంలో సంతానం లేని దంపతులకు రూ.7,000లకు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల వయస్సు గల బాలుడిని జాజ్‌పూర్ పోలీసులు మంగళవారం కాపాడారు. సోమవారం తన బిడ్డను రక్షించాలంటూ పాప తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
బిక్రమ్ ముండా, అతని భార్య జంగా ముండా బిరాజా దేవాలయం ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్నారని.. రోజువారీ కూలీ పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు అప్పటికే ఒక కుమార్తె సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. జంగా గత నెలలో మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
దీంతో దంపతులు సోమవారం జాజ్‌పూర్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. దీంతో పోలీసులు చిన్నారిని రక్షించాల్సిందిగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ)కి సమాచారం అందించారు. పోలీసులు, డిసిపిఓ, చైల్డ్‌లైన్ అధికారుల బృందం మంగళవారం హలాదిపాడు గ్రామానికి వెళ్లి చిన్నారిని రక్షించారు. 
 
"శిశువు ప్రస్తుతం స్థానిక చైల్డ్‌లైన్ అదుపులో ఉంది. పోలీసులు కేసును విచారిస్తున్నారని" చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ బరేంద్ర కృష్ణ దాస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments