Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. 12 రోజుల్లో ఇది మూడోసారి

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (19:34 IST)
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థి కోటాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 12 రోజుల్లో కోటాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడోసారి. మృతుడు విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని పీజీలో నివాసం ఉంటున్న 27 ఏళ్ల నూర్ మహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 
 
నూర్ పీజీలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
 
యూపీలోని గోండా జిల్లా వీర్‌పూర్‌కు చెందిన నూర్‌ మహ్మద్‌ స్వస్థలమని విజ్ఞాన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో కౌశల్య తెలిపారు. పీజీ నిర్వాహకుడి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

విద్యార్థి మెస్ నుంచి టిఫిన్ ఆర్డర్ చేసేవాడు. జనవరి 31న, మెస్‌ వ్యక్తి టిఫిన్‌ను గది బయటే ఉంచాడు. మరుసటి రోజు వరకు అది తినలేదు. తలుపు తట్టినా నూర్ తెరవకపోవడంతో పీజీ ఆపరేటర్‌కు ఫోన్ చేశాడు. ఆపరేటర్ కిటికీలోంచి చూడగా విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
 
విద్యార్థి 2016 నుంచి కోటాలో ఉంటున్నాడని, ఇక్కడే కోచింగ్‌ చేశాడని, ప్రస్తుతం బీటెక్‌కు ఎంపికై చెన్నైలోని కాలేజీలో అడ్మిషన్‌ రావడంతో ఏ కోచింగ్‌ సెంటర్‌లో చేరలేదని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. కోటాలో ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments