Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత సుదీర్ఘంగా సాగిన అయోధ్య కేసు

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (10:31 IST)
సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన రెండో కేసుగా అయోధ్య కేసు చరిత్రపుటలకెక్కింది. ఆగస్టు ఆరో తేదీన ఈ కేసు విచారణను ప్రారంభించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16వ తేదీ వరకు కొనసాగించింది. ఈ విచారణలో చివరి 40 రోజులు అత్యంత కీలంగా మారాయి. రామజన్మభూమిపై 1857లో న్యాయస్థానంలో తొలిసారి వ్యాజ్యం దాఖలు కాగా, 162 ఏళ్ల తర్వాత ఈ నెల 9వ తేదీ శనివారం తుది తీర్పు వెల్లడైంది. దీంతో వివాదాస్పద అయోధ్య కేసు ముగిసినట్టయింది. 
 
వాస్తవానికి ఈ వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకునేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీఫుల్లా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తిత్వ కమిటీని కోర్టు నియమించింది. ఈ కమిటీ ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చలేక పోయింది. దీంతో అయోధ్య కేసులో పరిష్కారం కోసం అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రంగంలోకి దిగింది. 
 
అదేసమయంలో ఈ కేసు విచారణ సమయంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. రామజన్మభూమికి సంబంధించి అఖిల భారత హిందూ మహాసభ తరపు న్యాయవాది వికాస్‌‌సింగ్‌ చూపించిన మ్యాప్‌ను కోర్టు హాల్‌లోనే ధవన్ చించివేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం వాకౌట్ చేస్తామని హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments