Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య వేడుకలకు ఎల్కే.అద్వానీ దూరం.. ఎందుకో తెలుసా?

వరుణ్
సోమవారం, 22 జనవరి 2024 (12:20 IST)
అయోధ్య రామ మందిర నిర్మాణానికి పునాది వేసిన భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ సోమవారం ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, బీజేపీ శ్రేణులు మాత్రం అనారోగ్య కారణాల వల్లే ఆయన ఈ మహా కార్యానికి దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరో బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి కూడా హాజరుకావడం లేదు. ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్వానీ తన అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. 
 
రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు రావాలంటూ అద్వానీ, జోషిని విశ్వహిందూ పరిషత్ గత యేడాది డిసెంబరు నెలలోనే ఆహ్వానించింది. కానీ, ఆయన అనారోగ్యం కారణంగా హాజరుకాలేక పోయారు. మరోవైపు, ఈ నెలాఖరులోగా బాల రాముడిని అద్వానీ దర్శించుకుంటారని విశ్వహిందూ పరిషత్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. దాదావు 60 దేశాల్లో వీహెచ్‌పీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments