Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య వేడుకలకు ఎల్కే.అద్వానీ దూరం.. ఎందుకో తెలుసా?

వరుణ్
సోమవారం, 22 జనవరి 2024 (12:20 IST)
అయోధ్య రామ మందిర నిర్మాణానికి పునాది వేసిన భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ సోమవారం ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, బీజేపీ శ్రేణులు మాత్రం అనారోగ్య కారణాల వల్లే ఆయన ఈ మహా కార్యానికి దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరో బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి కూడా హాజరుకావడం లేదు. ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్వానీ తన అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. 
 
రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు రావాలంటూ అద్వానీ, జోషిని విశ్వహిందూ పరిషత్ గత యేడాది డిసెంబరు నెలలోనే ఆహ్వానించింది. కానీ, ఆయన అనారోగ్యం కారణంగా హాజరుకాలేక పోయారు. మరోవైపు, ఈ నెలాఖరులోగా బాల రాముడిని అద్వానీ దర్శించుకుంటారని విశ్వహిందూ పరిషత్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. దాదావు 60 దేశాల్లో వీహెచ్‌పీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments