Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామాలయంలోనే యువతిపై సామూహిక అత్యాచారం..

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:11 IST)
అయోధ్య రామాలయంలో ఘోరం జరిగింది. అయోధ్య లోని రామజన్మ భూమి గుడి కాంప్లెక్స్‌లో పనిచేసే ఒక యువతి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా ఒక్కసారి కాకుండా మూడు సార్లు యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది. 
 
అయోధ్య జిల్లాలోని సహదత్‌గంజ్‌కు చెందిన వంశ్‌ చౌదరి తనను పర్యాటక ప్రదేశాలను చూపిస్తానంటూ..తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆగస్టు 16న తనను గెస్ట్‌ హౌస్‌కి తీసుకెళ్లి అక్కడే నిర్బంధించాడు. 
 
అతను, తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తనపై సామూహిక లైంగికదాడి చేశాడని.. ఆపై తన స్నేహితులైన వినరు కుమార్‌, మహ్మద్‌ షరీక్‌లను పిలిపించి మరీ అఘాయిత్యం చేశారని వివరించింది. 
 
ఇలా మరో మూడుసార్లు జరిగిందని.. బయట చెప్తే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై రాజకీయ పార్టీల ఆందోళన చేపట్టారు. మహిళా సంఘాలు సైతం మండిపడుతున్నాయి. 
 
కాగా బాధితురాలు అయోధ్య పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం బీఏ విద్యార్థినిగా చదువుతూ.. ఆమె రామజన్మభూమి ఆలయంలో క్లీనింగ్‌ సిబ్బందిగా కూడా పనిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments