Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామాలయంలోనే యువతిపై సామూహిక అత్యాచారం..

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:11 IST)
అయోధ్య రామాలయంలో ఘోరం జరిగింది. అయోధ్య లోని రామజన్మ భూమి గుడి కాంప్లెక్స్‌లో పనిచేసే ఒక యువతి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా ఒక్కసారి కాకుండా మూడు సార్లు యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది. 
 
అయోధ్య జిల్లాలోని సహదత్‌గంజ్‌కు చెందిన వంశ్‌ చౌదరి తనను పర్యాటక ప్రదేశాలను చూపిస్తానంటూ..తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆగస్టు 16న తనను గెస్ట్‌ హౌస్‌కి తీసుకెళ్లి అక్కడే నిర్బంధించాడు. 
 
అతను, తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తనపై సామూహిక లైంగికదాడి చేశాడని.. ఆపై తన స్నేహితులైన వినరు కుమార్‌, మహ్మద్‌ షరీక్‌లను పిలిపించి మరీ అఘాయిత్యం చేశారని వివరించింది. 
 
ఇలా మరో మూడుసార్లు జరిగిందని.. బయట చెప్తే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై రాజకీయ పార్టీల ఆందోళన చేపట్టారు. మహిళా సంఘాలు సైతం మండిపడుతున్నాయి. 
 
కాగా బాధితురాలు అయోధ్య పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం బీఏ విద్యార్థినిగా చదువుతూ.. ఆమె రామజన్మభూమి ఆలయంలో క్లీనింగ్‌ సిబ్బందిగా కూడా పనిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

రామ్ చరణ్ మూవీలో మత్తుకళ్ళ మోనాలిసా!!?

దర్శకుడు రాంగోపాల్ వర్మకు జైలుశిక్ష... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments