Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య కేసులో ట్విస్ట్ : విచారణ నుంచి వైదొలగిన ధర్మాసన జడ్జి

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (12:08 IST)
అయోధ్య కేసులో సరికొత్త ట్విస్ట్. అయోధ్య భూమి కేసు విచారణ నుంచి ధర్మాసనంలోని జడ్జి ఒకరు తప్పుకున్నారు. దీంతో ఈ కేసు విచారణ ఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. అలాగే, ఈ భూవివాద కేసును విచారించేందుకు సరికొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటుచేయనుంది. 
 
ఆరు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ భూవివాద కేసును విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైన విషయం తెల్సిందే. ఇందులో చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌, జస్టిస్ లలిత్‌లతో పాటు న్యాయమూర్తులు ఎస్ఏ బోదే, ఎన్వీ రమణ, డీవై చంద్రసూడ్‌లు సభ్యులుగా ఉన్నారు. 
 
అయితే, ఈ ధర్మాసనంలో జస్టిస్ లలిత్‌ ఉండటాన్ని సీనియర్ న్యాయవాది ఒకరు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ ధర్మాసనం నుంచి లలిత్ తప్పుకున్నారు. గతంలో ఇదే కేసులో మరొకరి తరపున లలిత్ న్యాయవాదిగా వాదనలు వినిపించడంతో ఇపుడు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా కేసును ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments