Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పులు...

ఠాగూర్
ఆదివారం, 17 మార్చి 2024 (16:23 IST)
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు భారత ఎన్నకల సంఘం ఈ మేరకు ఆదివారం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన కాకుండా, జూన్ 2వ తేదీని లెక్కించనున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాత్రం ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. కేవలం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాత్రమే ఈ మార్పు చేసినట్టు పేర్కొంది. 
 
మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్.. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ పోలింగ్ 
 
దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ సార్వత్రిక ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా మే నెల 13వ తేదీనే పోలింగ్ నిర్వహిస్తారు. 
 
లోక్‌సభ ఎన్నికలు ఇలా... 
 
తొలి దశ : ఏప్రిల్ 19వ తేదీన 102 లోక్‌సభ స్థానాలకు (21 రాష్ట్రాలు) 
రెండో దశ : ఏప్రిల్ 26వ తేదీ, 89 ఎంపీ స్థానాలు (13 రాష్ట్రాలు) 
మూడో దశ : మే 7వ తేదీ, 94 స్థానాలు (12 రాష్ట్రాలు) 
నాలుగో దశ : మే 13వ తేదీ, 96 ఎంపీ స్థానాలు (10 రాష్ట్రాలు) 
ఐదో దశ : మే 20వ తేదీ, 49 స్థానాలు (8 రాష్ట్రాలు) 
ఆరో దశ : మే 25వ తేదీ, 57 స్థానాలు (7 రాష్ట్రాలు) 
ఏడో దశ : జూన్ 1వ తేదీ 57 స్థానాలు (8 రాష్ట్రాలు) 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments