పంచతంత్రం : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లేటెస్ట్ ట్రెండ్స్

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (15:54 IST)
దేశంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఐదు రాష్ట్రాల్లోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా ఫలితాలు ఉన్నాయి. వాటి వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 403 సీట్లు ఉండగా బీజేపీ 265 చోట్ల ఆధిక్యం లేదా గెలుపు బాటలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ 133 స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 2, బీఎస్పీ 1, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 
 
పంజాబ్ రాష్ట్రంలో 117 సీట్లు ఉండగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 19, శిరోమణి అకాలీదళ్ 4, బీజేపీ 2, ఇతరులు ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 70 సీట్లు ఉండగా, బీజేపీ 48, కాంగ్రెస్ 18, బీఎస్పీ, ఇతరులు రెండేచి చోట్ల గెలుపొందారు. 
 
గోవాలో మొత్తం 40 సీట్లు ఉండగా బీజేపీ 19, కాంగ్రెస్ 12, టీఎంసీ 3, ఆప్ 3, ఇతరులు మూడుచోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
మణిపూర్‌ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా బీజేపీ 30, కాంగ్రెస్ 8, ఎన్.పి.పి 9, జేడీయు 4, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments