Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : త్రిపురలో బీజేపీ - సీపీఎం హోరాహోరీ

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం ఉదయం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో భాగంగా త్రిపురలో బీజేపీ - అధికార సీపీఎం మధ్య హోరాహోరీగా సాగుతోంది. నాగాలాండ్‌ల

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (09:08 IST)
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం ఉదయం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో భాగంగా త్రిపురలో బీజేపీ - అధికార సీపీఎం మధ్య హోరాహోరీగా సాగుతోంది. నాగాలాండ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళుతోంది. అలాగే మేఘాలయలో ఎన్.పి.పి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 
ఉదయం 9 గంటల వరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు... త్రిపుర (60)లో బీజేపీ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 2, సీపీఎం 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే, నాగాలాండ్‌(60)లో బీజేపీ 12, కాంగ్రెస్ 1, ఎన్.పి.ఎఫ్ 3 చోట్ల, మేఘాలయ(60) రాష్ట్రంలో బీజేపీ 4, కాంగ్రెస్ 9, ఎన్.పి.పి. 11, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 
 
ఈ మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. కాగా, త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరుగగా, మూడు రాష్ట్రాల్లోనూ 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వివిధ కారణాల వల్ల మూడింటిలోనూ 59 స్థానాలకే పోలింగ్‌ జరిగింది.
 
త్రిపుర, మేఘాలయలో అభ్యర్థుల మరణం కారణంగా ఒక్కో స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీజేపీ తరపున 47 మంది పోటీలో ఉన్నారు. నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్‌డీపీపీతో జత కట్టింది. ఇక్కడ ఎన్‌డీపీపీ 40 చోట్ల, బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ 18 స్థానాల్లోనే బరిలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments