Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధర రూ.200కు చేరుకుంటే.. టూ-వీలర్‌పై ట్రిపుల్ రైడింగ్‌

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (19:06 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అస్సోం బీజేపీ అధ్యక్షుడు భబేష్ కలిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 200 రూపాయలకు చేరుకుంటే టూ-వీలర్‌పై ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతించాలని ప్రభుత్వాన్ని సూచిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అంతేకాదు.. పెట్రోల్ లీటర్ ధర రూ.200కు చేరుకున్నప్పుడు టూ-వీలర్ వెహికల్ తయారీ సంస్థలు కూడా ముగ్గురు కూర్చునేందుకు వీలుగా వాహనాలను తయారు చేయాలని అస్సోం బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
దీంతో.. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు ముగ్గురు బయటకు వెళ్లాల్సి వస్తే కారుకు బదులుగా బైక్‌పై వెళుతున్నారని చెప్పడమే తన వ్యాఖ్యల ఉద్దేశమని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments