Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (18:39 IST)
ఇటీవల తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతంలో భాగమతి ఎక్స్‌‍ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. లూప్ లైనులో ఆగివున్న గూడ్సు రైలను 90 కిలోమీటర్ల వేగంతో వచ్చిన భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. కానీ, 200 మంది వరకు గాయపడ్డారు. పది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్టు రైల్వే శాఖ విచారణ బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ ప్రమాదం నుంచి ఇంకా మరిచిపోకముందే అస్సాంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 
 
అస్సాం రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలో అగర్తలా నుంచి ముంబైకి బయల్దేరిన ఈ రైలు ఇంజిన్‌తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. అస్సాంలోని దిబలోంగ్‌ స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్న 3.55 గంటలకు జరిగింది. రైలు ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఉండే పవర్‌ కార్‌, ఇంజిన్‌తో పాటు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందగానే.. సహాయక బృందాలు చేరుకున్నాయని తెలిపారు. ఈ ఘటనతో లుమ్‌డింగ్ - బాదర్‌పూర్ సింగిల్ - లైన్ హిల్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments