సెప్టెంబర్‌ 30 వరకు సాధారణ రైళ్లు లేనట్లే

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (09:59 IST)
దేశంలో కరోనా నేపథ్యంలో నాలుగు నెలలుగా ప్రయాణీకులకు దూరంగా వున్న రైళ్లు మరికొద్ది కాలం.. స్టేషన్లకే పరిమితమవడం ఖాయమైపోయింది. సెప్టెంబర్‌ 30 వరకు అన్ని సాధారణ రైళ్లను రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.

మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు అన్ని జోనల్‌ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఈ సేవలను ఆగస్ట్‌ 12 వరకు రద్దు చేస్తున్నట్లు జూన్‌ 25న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా మరోసారి రైల్వే సేవల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ప్రారంభించిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర రైళ్ల సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments