Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లే!

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:24 IST)
క‌రోనా మ‌హ‌మ్మ‌రి విజృంబిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిపే పరిస్థితులు లేవని, సమావేశాలు జరుపుదామని ఆలోచించడం కూడా తెలివైన నిర్ణయం అనిపించుకోదని కేంద్ర మంత్రులు భావిస్తున్నారు.

ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేస్తూ, శీతాకాల సమావేశాలకు తొందరేమీ లేదని, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఆరు నెలల్లోగా ఓ మారు సమావేశమైతే సరిపోతుందని, దీని ప్రకారం, నేరుగా బడ్జెట్ సమావేశాలను జనవరి చివరి వారంలో ప్రారంభిస్తే సరిపోతుందని వారు అభిప్రాయపడ్డారు.
 
గత సెప్టెంబర్ లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న వేళ, పలువురు ఎంపీలు కరోనా బారిన పడటంతో ముందుగానే పార్లమెంట్ ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మొత్తం 17 మంది లోక్ సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులకు వ్యాధి సోకింది.

కొవిడ్ నిబంధనలను కచ్ఛితంగా పాటిస్తూ ఉన్నప్పటికీ పరిస్థితి విషమించింది. పార్లమెంట్ హాల్ లో భౌతికదూరం పాటిస్తూ ఉన్నా, రెగ్యులర్ గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ జరుగుతున్నా కేసులు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించకూడదని కేంద్రం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments