Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లే!

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:24 IST)
క‌రోనా మ‌హ‌మ్మ‌రి విజృంబిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిపే పరిస్థితులు లేవని, సమావేశాలు జరుపుదామని ఆలోచించడం కూడా తెలివైన నిర్ణయం అనిపించుకోదని కేంద్ర మంత్రులు భావిస్తున్నారు.

ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేస్తూ, శీతాకాల సమావేశాలకు తొందరేమీ లేదని, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఆరు నెలల్లోగా ఓ మారు సమావేశమైతే సరిపోతుందని, దీని ప్రకారం, నేరుగా బడ్జెట్ సమావేశాలను జనవరి చివరి వారంలో ప్రారంభిస్తే సరిపోతుందని వారు అభిప్రాయపడ్డారు.
 
గత సెప్టెంబర్ లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న వేళ, పలువురు ఎంపీలు కరోనా బారిన పడటంతో ముందుగానే పార్లమెంట్ ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మొత్తం 17 మంది లోక్ సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులకు వ్యాధి సోకింది.

కొవిడ్ నిబంధనలను కచ్ఛితంగా పాటిస్తూ ఉన్నప్పటికీ పరిస్థితి విషమించింది. పార్లమెంట్ హాల్ లో భౌతికదూరం పాటిస్తూ ఉన్నా, రెగ్యులర్ గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ జరుగుతున్నా కేసులు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించకూడదని కేంద్రం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments