Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లే!

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:24 IST)
క‌రోనా మ‌హ‌మ్మ‌రి విజృంబిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిపే పరిస్థితులు లేవని, సమావేశాలు జరుపుదామని ఆలోచించడం కూడా తెలివైన నిర్ణయం అనిపించుకోదని కేంద్ర మంత్రులు భావిస్తున్నారు.

ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేస్తూ, శీతాకాల సమావేశాలకు తొందరేమీ లేదని, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఆరు నెలల్లోగా ఓ మారు సమావేశమైతే సరిపోతుందని, దీని ప్రకారం, నేరుగా బడ్జెట్ సమావేశాలను జనవరి చివరి వారంలో ప్రారంభిస్తే సరిపోతుందని వారు అభిప్రాయపడ్డారు.
 
గత సెప్టెంబర్ లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న వేళ, పలువురు ఎంపీలు కరోనా బారిన పడటంతో ముందుగానే పార్లమెంట్ ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మొత్తం 17 మంది లోక్ సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులకు వ్యాధి సోకింది.

కొవిడ్ నిబంధనలను కచ్ఛితంగా పాటిస్తూ ఉన్నప్పటికీ పరిస్థితి విషమించింది. పార్లమెంట్ హాల్ లో భౌతికదూరం పాటిస్తూ ఉన్నా, రెగ్యులర్ గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ జరుగుతున్నా కేసులు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించకూడదని కేంద్రం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments