Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర.. పసిగట్టిన నిఘా వర్గాలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. నిజానికి దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (13:43 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. నిజానికి దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని విద్రోహ శక్తుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందనీ... అయినా తాను భయపడే ప్రసక్తే లేదని ఇటీవల మోడీ గోవాలో జరిగిన ఓ ర్యాలీలో ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ వార్తలను నిజం చేస్తూ.. ఆయన హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. 
 
ఈ మేరకు మోడీ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఢిల్లీ పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. ఇది కలకలం రేపుతోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకారం... పొలీసులు దీనిపై ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. మోడీకి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని.. ఇది కేవలం బూటకపు ఫోన్‌కాల్ మాత్రమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం ప్రధానికి ప్రమాదం తీసుకొచ్చే ఏ చిన్నపాటి అవకాశాన్ని కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. 
 
ఈ నేపథ్యంలోనే ఆయన భద్రతకు సంబంధించిన అంశంపై పోలీసులు మరింత సీరియస్‌గా దృష్టిపెట్టారు. మోడీ చంపేందుకు కుట్రజరగుతోందంటూ... దినేష్ కుమార్ అనే వ్యక్తి పేరిట ఉన్న ఫోన్ నుంచి బుధవారం రాత్రి 11:30కి పోలీసులకు కాల్ వచ్చింది. దినేష్ బురారీకి చెందినవాడయినప్పటికీ... ఫోన్ మాత్రం దిల్షాద్ కాలనీ నుంచి వచ్చినట్టు గుర్తించారు. కాల్ లొకేషన్‌కు వెళ్లి విచారించగా.. సదరు షాప్‌లో ఎవరూ కనిపించలేదు. దీంతో దినేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments