రేషన్ దుకాణాల్ల త్రివర్ణ పతాకాలు విక్రయమా? సిగ్గు చేటు : రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (11:45 IST)
దేశంలో 75వ సాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను కేంద్రం ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనుంది. దీన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం జాతీయ జెండాలను ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో విక్రయించేలా ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. జాతీయవాదాన్ని భారతీయ జనతా పార్టీ పాలకలు అమ్మకానికి పెట్టిందని, పేదల ఆత్మాభిమానాన్ని గాయపరుస్తోందని ఆయన మండిపడ్డారు. మువ్వన్నెల పతాకం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని, అది అందరి హృదయాల్లో నిలిచి ఉంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 
 
"జాతీయవాదం ఎప్పటికీ అమ్ముడుపోదు. రేషన్ దుకాణాల్లో సరుకులు ఇస్తూ రూ.20తో జాతీయ జెండాను కూడా కొనుగోలు చేయాలని చెప్పడం సిగ్గుచేటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొందరు రేషన్ కార్డుదారులు తమను జాతీయ జెండా కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారంటూ చెబుతున్న వీడియోను కూడా రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Legendary Biopic: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవి లేదా కీర్తి సురేష్?

మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా పోలీస్ కంప్లైంట్ టీజర్

గుర్రం పాపిరెడ్డి లాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది : బ్రహ్మానందం

గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్... వృషభను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది

Boyapati: అవెంజర్స్ కి స్కోప్ ఉన్నంత సినిమా అఖండ 2 తాండవం : బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments