Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచింగ్‌ హబ్‌ కోటాలో 25కి చేరిన ఆత్మహత్యలు.. తాజాగా విద్యార్థిని విషం తాగి..?

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (14:15 IST)
రాజస్థాన్‌లోని ప్రముఖ కోచింగ్‌ హబ్‌ కోటాలో విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. తాజాగా కోటాలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఏడాది అక్కడ సూసైడ్‌ చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 25కి చేరింది. 
 
వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్ధిని విషం సేవించి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మహువా జిల్లాకు చెందిన మృతురాలు ప్రియమ్‌ సింగ్‌ (17) ఒకటిన్నర ఏడాదిగా కోటాలో నీట్‌ యూజీకి కోచింగ్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటోన్న ప్రియమ్‌ సమీపంలోని కోచింగ్‌ సెంటర్‌లో ఏడాదిన్నర నుంచి నీట్‌కు శిక్షణ తీసుకొంటోంది. సోమవారం కోచింగ్‌ సెంటర్‌లోనే వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురైంది. 
 
తోటి విద్యార్థులు కోచింగ్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆమెను తల్వాండిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రియమ్‌ చికిత్స పొందుతూ సాయంత్రం 6.45 గంటలకు మరణించినట్లు విజ్ఞాన్‌ నగర్‌ పోలీస్‌ ఇన్‌ఛార్జ్‌ కౌశల్య తెలిపారు.
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్ధి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా విద్యార్థిని విషం సేవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments