Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌ కౌంటర్‌

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:40 IST)
జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం మరో ఎన్‌ కౌంటర్‌ జరిగింది. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవానుతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

శ్రీనగర్‌లోని పాంతా చౌక్‌ వద్ద సిఆర్‌పిఎఫ్‌ దళాలు, పోలీసులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని, భద్రతా సిబ్బంది కూడా ధీటుగా ఎదుర్కొన్నాయని అన్నారు. గంటలపాటు జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఎఎస్‌ఐ బబూరామ్‌ మరణించినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, మూడురోజుల వ్యవధిలో పది మంది ఉగ్రవాదులపై సిఆర్‌పిఎఫ్‌ జవానులు కాల్పులు జరిపారు.

పుల్వామా జిల్లాలోని జాదూరా ప్రాంతంలో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు, సోపియాన్‌ జిల్లాలోని జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. కాగా, కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments