ప్రధాని మోదీతో జగన్ భేటీ.. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:35 IST)
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చ జరిపారు. ప్రధాని నివాసంలో ఈ కీలక సమావేశం జరిగింది.  
 
పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలపై ప్రధాన మంత్రికి ఏపీ సీఎం జగన్ వినతిపత్రం అందజేశారు.
 
సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు.
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మధ్య ఎలాంటి రిలేషన్‌‌ ఉంటుందో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రా ప్రజలకు వివరించారు. జగన్‌మోహన్ రెడ్డి అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అభిమానమని.. ఎప్పుడు కనిపించినా ఒక తండ్రిలా ఆప్యాయంగా పలకరిస్తారన్నారు.  
 
నాసిన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2024 నాటికి నాసిన్ పనులు పూర్తి చేస్తామన్నారు. నాసిన్ ఏర్పాటుకు సహకరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి.. భూములిచ్చిన రెండు గ్రామాల రైతులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 
 
అకాడమీ ఏర్పాటుతో పాలసముద్రం, హిందూపురం ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పాలసముద్రం గ్రామానికి రూ.729 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments