Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా అంజలీ.. లేచి నన్ను చూడు అంజలీ...

Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:46 IST)
కాళ్ళపారాణి ఆరకముందే ఓ నవవధువు మృత్యుఒడిలోకి చేరుకుంది. భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె చనిపోగా, భర్త గాయపడ్డాడు. ఈ హృదయ విదాకర ఘటన అనంతపురం జిల్లా హిందూపురం అర్బన్ ఏరియాలో జరిగింది.
 
ఈ ప్రమాద వార్తపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మడకశిర మండలం సీరాయపురానికి చెందిన పవన్‌కుమార్‌, అంజలీ హిందూపురంలోని కొటిపి లయోల పాఠశాలలో చదువుతున్న పవన్‌ సోదరుడిని చూసేందుకు ద్విచక్రవాహనంపై వచ్చారు. 
 
అతన్ని చూసిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పరిగి రోడ్డు కట్టకాలువ వద్ద హిందూపురం వైపు నుంచి మడకశిర వైపు వెళ్తుండగా వెనకాల నుంచి తమిళనాడుకు చెందినలారీ ఢీకొంది. దీంతో దంపతులిద్దరు కిందపడ్డారు. అయితే, అంజలి లారీ వెనుక చక్రాల కింద పడిపోయింది. దీంతో ఆమెపై లారీ ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత స్థానికులు గుర్తించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే కన్నుమూసింది. 
 
తన కళ్ల ముందే కట్టుకున్న భార్య మృతిచెందడంతో భర్త పవన్‌ కుమార్‌ రోదించిన తీరు వర్ణనాతీతం. తనను ఒంటరిగా వది వెళ్లిపోయావా.. లేచి నన్ను చూడు అంజలీ.. దేవుడా నన్నుకూడా తీసుకుపో.. అంటూ రోధించాడు. అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంట కన్నీరు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments