Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్నే పెళ్లాడుతానని పట్టుబట్టింది.. పెళ్లై, పిల్లలున్నారని చెప్పినా వినలేదు.. చివరికి?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:36 IST)
నిన్నే పెళ్లాడుతానని మరదలు పట్టుబట్టింది. ఇంకో వ్యక్తితో నిశ్చితార్థం జరిగినా.. మేనమామనే వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. తనకు పెళ్లై పిల్లలున్నారని చెప్పినా ఒప్పుకోలేదు. అంతే ఇక చేసేది లేక తన వెంటపడుతున్న మరదలిని కొట్టి చంపేశాడు మేనమామ. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, ధర్మవరంలోని నాగలూరు చెందిన నవ్యశ్రీ.. ఎంబీఏ పూర్తిచేసింది. 
 
అయితే కడప జిల్లా, ప్రొద్దుటూరు, తొండూరు మండలంలో దారుణ హత్యకు గురైంది. ఈమె హత్యకు గల కారణాలను పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు. 26 ఏళ్ల నవ్యశ్రీకి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. కానీ నగలు కొనేందుకు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లిన నవ్యశ్రీ.. మల్లెల ఘాట్ వద్ద హత్యకు గురైంది. నవశ్రీ చివరిగా మేనబావ జగన్మోహన్ రెడ్డితో కనిపించడంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. 
 
మేనమామంటే ఇష్టం పెంచుకున్న నవ్యశ్రీ.. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అయిష్టంగానే ఒప్పుకుందని.. మేనమామ జగన్ తనకు పెళ్లై పిల్లలున్నారని చెప్పినా ఒప్పుకోలేదని.. అందుకే ఎంత చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఆవేశంలో చంపేశానన్నాడు. బండరాయితో మోది నవ్యశ్రీని హతమార్చినట్లు పోలీసులకు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇందుకు అతని స్నేహితుడు రవి కూడా సాయం చేశాడు. 
 
హత్య తర్వాత ఏమీ తెలియనట్టుగా అందరితో తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం చెప్పాడు. జగన్ మోహన్ రెడ్డితో పాటు రవిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments