Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాకు క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. ఎందుకో తెలుసా?

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (11:56 IST)
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం సందర్భంగా ఏదేని పొరపాటు జరిగివుంటే క్షమించాలని ఆమె మీడియాను కోరారు. పెళ్లి సందర్భంగా చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. పైగా, మీరంతా రేపు మా అతిథులుగా రావాలని, మీకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. 
 
కాగా, అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం ఈ నెల 12వ తేదీన అంగరంగం వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత శుభ్ ఆశీర్వాద్, ఆదివారం మంగళ్ ఉత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతా అంబానీ కృతజ్ఞతలు తెలుపుతూనే క్షమాపణలు కోరారు. 
 
మరోవైపు నీతా అంబానీ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని చూసి గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతులేని సంపద ఉన్నప్పటికీ ఆమెకు కించిత్ గర్వం కూడా లేదని కొనియాడుతున్నారు. మరోవైపు, ఆదివారం జరిగిన రిసెప్షన్‌లో తోడి పెళ్ళికుమారులుగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోలకు రూ.2 కోట్ల విలువ చేసే లగ్జరీ వాచీలను అనంత్ అంబానీ బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments