కమలం గూటికి ఆనంద్ శర్మ? పుకార్లేనంటున్న కాంగ్రెస్ నేత!

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (10:51 IST)
దేశంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతోంది. దీంతో ఆ పార్టీకి చెందిన దిగ్గజ నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాషాయం పార్టీలో చేరిపోయారు. తాజాగా మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా కమలం గూటికి వెళ్ళనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఆయన తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. దీంతో ఆనంద్ శర్మ ఇక కమలం పార్టీలో చేరడమే మిగిలివుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా మరికొన్ని నెలల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్ శర్మ, జేపీ నడ్డాల మధ్య జరిగిన భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 
 
మరోవైపు, తాను పార్టీ మారుతున్నట్టు సాగుతున్న ప్రచారాన్ని ఆనంద్ శర్మ ఖండించారు. ఎప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీ వాదినేనని చెప్పారు. పైగా, జేపీ నడ్డాను కలవడం తన హక్కు అని, తామిద్దరం ఒకే రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నామని గుర్తుచేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి దూరమైపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments