Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్... ఆనంద్ శర్మ రాజీనామా

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (08:13 IST)
కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు ఇదే బాటలో మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ పీసీసీ స్టీరింగ్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. 
 
తనను పిలవకుండానే, కనీసం సంప్రదించకుండానే స్టీరింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని ఆనంద్ శర్మ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో తన ఆత్మగౌరవం దెబ్బతిందని, ఆత్మగౌరవంపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. అయితే, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున తాను ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. 
 
కాగా, 1982లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆనంద్ శర్మను నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1984లో రాజ్యసభకు  పంపారు. అప్పటి నుంచి మొన్నటివరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. పలు శాఖలకు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments