కాంగ్రెస్ పార్టీకి మరో షాక్... ఆనంద్ శర్మ రాజీనామా

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (08:13 IST)
కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు ఇదే బాటలో మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ పీసీసీ స్టీరింగ్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. 
 
తనను పిలవకుండానే, కనీసం సంప్రదించకుండానే స్టీరింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని ఆనంద్ శర్మ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో తన ఆత్మగౌరవం దెబ్బతిందని, ఆత్మగౌరవంపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. అయితే, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున తాను ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. 
 
కాగా, 1982లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆనంద్ శర్మను నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1984లో రాజ్యసభకు  పంపారు. అప్పటి నుంచి మొన్నటివరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. పలు శాఖలకు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments