Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీఏ విద్యార్థిని వినూత్న ప్రచారం.. నృత్యరూపంలో హెల్మెట్స్ ధరించాలంటూ..

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (09:54 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ ఎంబీఏ విద్యార్థిని చేస్తున్న వినూత్న ప్రచారం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు, శిరస్త్రాణాం ధరించాలంటూ నృత్యరూపంలో ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విద్యార్థిని గురించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఆ ఎంబీఏ విద్యార్థిని పేరు షుబీ జైన్. ఇండోర్ నగరంలోని రోడ్లపై వాహనదారులకు జాగ్రత్తలు చెబుతూ వారిని సురక్షితంగా ఉండాలని హితబోధ చేస్తుంది. షుబీ జైన్ చెప్పే విధానం ఓ సంగీత నృత్యరూపకం తరహాలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
 
తన ప్రచార కార్యక్రమానికి కాస్తంత డ్యాన్స్ కూడా జోడించి షుబీ చేస్తున్న విజ్ఞప్తులకు వాహనదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా హెల్మెట్లు ధరించాలన్నది ఆమె చేపట్టిన కార్యక్రమం సారాంశం! ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆమె నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ స్ఫూర్తి పొందాడో ఏమో కానీ ఆయన కూడా డ్యాన్స్ మూమెంట్స్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తూ దర్శనమిచ్చాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments