Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతి ఆయోగ్ కార్యాలయ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:35 IST)
ఈ కరోనా వైరస్ ఓ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. పుట్టినబిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ఈ వైరస్ బారినపడుతున్నారు. అంతేకాకుండా, ఈ ఆఫీస్.. ఆ ఆఫీస్ అని లేకుండా అన్ని ఆఫీసులకు ఈ వైరస్ సోకుతోంది. తాజాగా సుప్రీంకోర్టు, జ్యూడీషియల్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. ఇపుడు ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో పని చేసే ఆఫీసర్‌కు పాజిటివ్ అని తేలింది. 
 
దీంతో ఈ కార్యాలయ భవనాన్ని సీజ్ చేశారు. రెండు రోజుల పాటు ఆ బిల్డింగ్‌లో శానిటైజేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్ర‌ట‌రీ అజిత్ కుమార్ తెలిపారు. ఆరోగ్య శాఖ ఆదేశాల ప్ర‌కారం బిల్డింగ్‌ను మూసివేస్తున్నారు. ఇక పాజిటివ్ వ‌చ్చిన అధికారితో ట‌చ్‌లో ఉన్న‌వారిని క్వారెంటైన్‌లోకి వెళ్లాల‌ని ఆదేశించారు.
 
మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా 80 జిల్లాల్లో గ‌త ఏడు రోజుల నుంచి ఎటువంటి కొత్త కేసులు న‌మోదు కాలేద‌ని కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ వెల్లడించారు. 47 జిల్లాల్లో గ‌త 14 రోజుల నుంచి ఎటువంటి పాజిటివ్ కేసు న‌మోదు కాలేదని గుర్తుచేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments