Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్ రూమ్ లోనే బాలిక మృతి.. చలి తీవ్రత కారణంగా గుండెపోటు?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (13:20 IST)
రాజ్ కోట్ లో తరగతి లోనే బాలిక మృతి చెందింది. చలి తీవ్రత కారణంగా రాజ్ కోట్ లో బాలిక ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల రియా సాగర్, రాజ్ కోట్ లోని గొండాల్ రోడ్ లో వున్న ప్రైవేట్ స్కూలులో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్కూలుకు వెళ్లింది. 
 
ప్రేయర్ తర్వాత క్లాస్ రూముకు వెళ్లింది. స్కూల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్కూల్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 
చలి కారణంగానే తన కుమార్తె మరణించిందని.. రియాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని విద్యార్థిని తల్లి జానకి తెలిపింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్‌కు రప్పిస్తున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు తల్లి జానకి తెలిపింది.
 
అయితే విద్యార్థిని రియా తల్లి వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే ఆ బాలిక మరణానికి కారణం తెలియవస్తుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments