Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టదిగ్బంధం చేస్తామంటూ రైతుల హెచ్చరిక : అర్థరాత్రి కీలక భేటీ!

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (11:29 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇందులోభాగంగా, ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల రైతులు కలిసి ఢిల్లీకి వెళ్లే రహదారులను దిగ్బంధించారు. అంతేకాకుండా ప్రభుత్వం దిగిరాకుంటే ఢిల్లీని అష్టదిగ్బంధనం చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. పైగా, ఈ ఉద్యమం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దీంతో బీజేపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. 
 
ఢిల్లీలో అర్థరాత్రి కీలక భేటీ నిర్వహించారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలతో పాటు.. మరికొందరు మంత్రులున్నారు. ఢిల్లీ వేదికగా రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఏం చేద్దాం అన్నదానిపైనే ఈ సమావేశం సాగినట్లు తెలుస్తోంది. ఢిల్లీని అష్టదిగ్బంధనం చెస్తామంటూ రైతు సంఘాల నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 
 
అంతేకాకుండా హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చాయి. దీంతో పాటు రైతుల విషయంలో తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై వీరు చర్చించినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
కొత్త వ్యవసాయ చట్టాల్ని తీవ్రంగా నిరసిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావని రైతులు వరుసగా నాలుగో రోజూ ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు వణికే చలిని తట్టుకుంటూనే నిరసన కొనసాగించారు. రైతులు పట్టువిడవకుండా బైఠాయించడంతో కేంద్రంలో కదలిక మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments