అన్ని మతాల వారు స్కూల్ యూనిఫాం ధరించాలి : అమిత్ షా

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (07:21 IST)
దేశంలోని అన్ని మతాలకు చెందిన పిల్లలు ఖచ్చితంగా స్కూల్ యూనిఫాం ధరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అయితే, హిజాబ్ వివాదంలో కోర్టు తీర్పును గౌరవిస్తామని ఆయన చెప్పారు. 
 
ఇటీవల కర్నాకట రాష్ట్రంలోని ఓ పాఠశాలలో హిజాబ్ వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వివాదంపై స్పందించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం అంటే యూనిఫామం ధరించి స్కూలుకు రావడానికే తాను మద్దతు పలుకుతానని చెప్పారు. 
 
దేశంలోని అన్ని మతాల వారు స్కూలు యూనిఫాంలను అంగీకరించాలని ఆయన ఉద్ఘాటించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అయితే, హిజాబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు తీర్పును వెలువరించిన తర్వాత తన అభిప్రాయం మారొచ్చని తెలిపారు. కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉన్నప్పటికీ దాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. 
 
అదేసమయంలో దేశ ప్రజలంతా రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలో... ఇష్టానుసారంగా నడుచుకోవాలో తేల్చుకోవాల్సి ఉందని అమిత్ షా అన్నారు. హిజాబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు ఇచ్చే తీర్పును ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments