Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిజాబ్ వివాదం.. కంగనా స్పందన.. మీకు ధైర్యం చూపించాలని ఉంటే?

హిజాబ్ వివాదం.. కంగనా స్పందన.. మీకు ధైర్యం చూపించాలని ఉంటే?
, శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:30 IST)
ఉడుపిలోని గవర్నమెంట్ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటక హైకోర్టు వరకూ చేరింది. శాంతి, సామరస్యంతో ఉండాలంటూ సీఎం సైతం మూడు రోజుల పాటు విద్యా సంస్థలు మూసేయాలని పిలుపునిచ్చారు. దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్న క్రమంలో మతపరమైన దుస్తులను తీర్పు వచ్చేంత వరకూ ధరించకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. 
 
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ హిజాబ్ వివాదంపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రచయిత ఆనంద్ రంగాథన్ చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి దానిపై "మీకు ధైర్యం చూపించాలని ఉంటే అఫ్ఘానిస్తాన్ కు వెళ్లి బురఖా లేకుండా ఉండండి. స్వేచ్ఛగా ఉండండి. మిమ్మల్ని మీరు బంధించుకోకండి" అంటూ పోస్టు పెట్టారు కంగనా.
 
స్కూల్స్‌లో హిజాబ్ నిషేదించడంపై ఆనంద్ రంగనాథన్ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన పోస్టులో ‘ఇరాన్ 1973లో అని బికినీ వేసుకున్న అమ్మాయిల ఫొటోలు… ప్రస్తుతం బుర్ఖాలు వేసుకున్న ఫొటోలతో.. చరిత్ర నుంచి తెలుసుకోలేని వాళ్లు దానిని రిపీట్ చేయాలనుకుంటున్నారు’ అని పోస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మే నెలలో టెన్త్ పరీక్షా ఫలితాలు