Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం 4 గంటల్లో వంతెనను నిర్మించిన ఇండియన్ ఆర్మీ

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:32 IST)
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర సాగలేదు. ఇపుడు కరోనా వైరస్ వ్యాప్తి శాంతించడంతో రెండేళ్ళ తర్వాత అమర్నాథ్ యాత్రకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, అమర్నాథ్ భక్తులకు జమ్మూకాశ్మీర్‌లోని ప్రతికూల వాతావరణం అనుకూలించడం లేదు. అదేసమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారత సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోంది. 
 
తాజాగా, ఈ యాత్ర కొనసాగే మార్గంలో కొండచరియలు విరిగి కొట్టుకుపోయిన బల్తాల్‌ వంతెనను కేవలం 4 గంటల్లోనే పునరుద్ధరించారు. ఇటీవలే యాత్ర మార్గంలోని బల్తాల్‌ వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. కాళీమాతా ఆలయ సమీపంలోని ప్రవాహం వద్ద ఈ ఘటన జరిగింది. 
 
వంతెన కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్‌ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త వంతెనను అందుబాటులోకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments