Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశ్ రాజ్‌కి 3 రాష్ట్రాల్లో 4 ఓట్లు ఉన్నాయ్.. జగన్ ఫిర్యాదు

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (12:37 IST)
నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్‌కి నాలుగు ఓట్లు ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన జగన్ కుమార్ అనే సామాజిక వేత్త కర్ణాటక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
ప్రకాశ్ రాజ్‌కు మూడు రాష్ట్రాల్లో నాలుగు ఓట్లు ఉన్నాయని, అది చట్టరీత్యా నేరం అంటూనే ఇందుకు ఒక్క సంవత్సరం జైలు శిక్ష కూడా వెయ్యవచ్చునని సామాజిక వేత్త జగన్ కుమార్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం అతని అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేయాలని జగన్ కుమార్ కోరుతున్నారు.
 
ప్రకాశ్ రాజ్‌కు బెంగళూరులో ఒక ఓటు.. తమిళనాడులోని వేలచ్చేరిలో రెండు ఓట్లు.. తెలంగాణలోని శేర్‌లింగంపల్లిలో ఒక ఓటు ఉందని, అలాగే ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఓట్లు యాక్టీవ్‌గా ఉన్నాయని, ఇది చట్టంలోని సెక్షన్ 17,18 మరియు సెక్షన్ 31లను ఉల్లంఘించడమే అని జగన్ కూమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు.
 
ప్రకాశ్ రాజ్‌ ఓట్లకు సంబంధించిన కార్డుల కాపీలను కూడా జగన్ కుమార్ తన ఫిర్యాదు లేఖకు జత చేశారు. వెంటనే ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలని జగన్ కుమార్ ఎన్నికల సంఘాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments