Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్‌కు ఈసీ షాక్... అజిత్ పవార్‌కే ఎన్సీపీ సొంతం!!

ఠాగూర్
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (20:12 IST)
దేశంలోనే కురువృద్ధ రాజకీయ నేతగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నిక సంఘం తేరుకోలేని షాకిచ్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్‌కు చెందినదని మంగళవారం స్పష్టం చేసింది. ఎన్సీపీ గుర్తు గడియారం కూడా అజిత్ పవార్‌ వర్గానికే కేటాయిస్తున్నట్టు తీసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న శరద్ పవార్ 1999లో నాటి కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ ఎన్నికల్లో ఎన్సీపీని స్థాపించారు. తిరిగి 1999లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్రంలోని యూపీఏ సర్కారులో చేరారు. 2014 వరకూ యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎన్సీపీ ఉంది. 
 
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సీపీ కూడా దెబ్బతిన్నది. అదే ఏడాది చివర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా, సీఎం పదవి విషయమై ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీ నాయకత్వంలో విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారు. కానీ, వ్యూహాత్మకంగా వ్యహరించిన బీజేపీ.. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనను చీల్చింది. తదుపరి శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీని రెండుగా చీల్చింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఎన్సీపీని అజిత్ పవార్‌కు అప్పగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం శరద్ పవార్‌కు గట్టి షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments