Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్‌‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ - సస్పెండ్ చేసిన ఈసీ

anjanikumar revanth reddy
, ఆదివారం, 3 డిశెంబరు 2023 (19:16 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. అయితే, కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే రేవంత్‌ రెడ్డిని అంజనీకుమార్ యాదవ్ కలవడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీంతో డీజీపీ చర్యను నిబంధనల ఉల్లంఘన కింద ఈసీ భావించి, సస్పెండ్ చేసింది. ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే కాంగ్రెస్ హవా స్పష్టమైంది. ఈ క్రమంలో డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ తన అనుచరులతో రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అభినందనలు తెలిపారు. 
 
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్... 
 
అసెంబ్లీ ఎన్నికల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఊహించని షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. 
 
రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్యలు 90 కాగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 57 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ 33 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 71 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 14 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ దఫా తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం చూపినప్పటికీ తర్వాత వెనకబడింది. .
 
మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 165 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు, ఇతరులు ఒక స్థానంలో నిలిచారు. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో 199 సీట్లకు గాను బీజేపీ 115 సీట్లు, కాంగ్రెస్ 69, ఐఎన్డీ 7, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ ఇంట్లో పెళ్లి బాజాలు- షర్మిల కుమారుడి ప్రేమ వివాహం.. ఎప్పుడు?