Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ఐవీఆర్
సోమవారం, 23 జూన్ 2025 (23:48 IST)
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం జరిగి కనీసం 15 రోజులు కూడా కాలేదు. ఇంకా చాలా కుటుంబాలు విమాన ప్రమాదంలో మరణించిన తమవారి ఆచూకి తెలిపే డిఎన్ఎ రిపోర్టులు సరిపోలడంలేదు. చాలా కుటుంబాలు తమ ప్రియమైన వారిని చివరిసారిగా చూడలేకపోయాయి. ఇంకా అనేక మృతదేహాలను అప్పగించలేదు.
 
ప్రమాదంలో మరణించినవారి ఇళ్లలో తీవ్ర విషాదం అలుముకుని వుంది. అంత్యక్రియలు కూడా జరిపించేందుకు తమవారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లేందుకు కూడా లభించలేదు. ఇలాంటి సమయంలో ఈనెల 20న, ఎయిర్ ఇండియా SATS SVP సంప్రీత్ కోటియన్, COO అబ్రహం జకారియా కార్యాలయంలో డిజె పార్టీని నిర్వహించారు. ఎంతో సంతోషంగా చిందులేస్తూ పార్టీ చేసుకున్నారు. ఆ రోజు కంపెనీ CFO కూడా అక్కడే ఉన్నారు.
 
ఒకవైపు ఘోర విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే ఇలాంటి డీజే పార్టీలు చేసుకుంటూ చిందులు వేయడం ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ వీడియో వైరల్ కావడంతో ఏఐసాట్ అధికారులు స్పందించారు. ఇదేదో కావాలని చేయలేదని, రెండు కంపెనీలకు చెందిన అధికారులు సమావేశం జరిగినప్పుడు అనుకోకుండా అలా అయిపోయిందనీ, ఈ వీడియో విషయం మా దృష్టికి వచ్చిందనీ, దీనిపట్ల తీవ్రంగా చింతిస్తున్నామంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments