Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరుగా వస్తారా? తొలగించమంటారా? దినకరన్ వర్గానికి స్పీకర్ నోటీసులు

తన ఎదుట నేరుగా హాజరవుతారా? లేదా? చర్యలు తీసుకోమంటారా? అంటూ అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ నోటీసులు జారీ చేశారు. ఈ

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (16:09 IST)
తన ఎదుట నేరుగా హాజరవుతారా? లేదా? చర్యలు తీసుకోమంటారా? అంటూ అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14న హాజరై వివరణ ఇవ్వాలన్నారు. ఈ నోటీసు‌తో వారు షాక్‌కు గురయ్యారు. 
 
ముఖ్యమంత్రి పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంను తన వర్గంలో చేర్చుకున్న తర్వాత దినకరన్ తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెల్సిందే. ఈయనకు 19 మంది ఎమ్మెల్యేలు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ 19 మందికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అవసరమైతే వారి సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్‌ను ప్రభుత్వ విప్ కోరారు.
 
ఈనేపథ్యంలో తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందో వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ సరిగా లేకపోతే వారిపై స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు 19 మంది ఎమ్మెల్యేలు చేజారకుండా దినకరన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments