Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుపై శునకం కూర్చొందనీ... తుపాకీతో కాల్చి చంపిన కసాయి

Webdunia
గురువారం, 14 మే 2020 (12:00 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తాను ఎంతో ఇష్టపడి కనుక్కొన్న కారుపై ఓ కుక్క కూర్చొంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ కారు యజమానికి పట్టరాని కోపం వచ్చింది. అంతే.. తనవద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దుశ్చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని రానిప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బహుళ అంతస్తు భవన సముదాయంలో జిగర్‌ పంచాల్‌ (35) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈయన ఎంతో ఇష్టపడి ఓ కారును కొనుగోలు చేసి, ఆ ప్రాంగణం వెలుపల పార్కింగ్ చేశాడు.
 
అయితే, ఓ వీధి శునకం ఆ కారుపై కూర్చొంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. దీన్ని చూసిన పంచాల్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తన వద్ద ఉన్న తుపాకీతో కుక్కపై గురిపెట్టి కాల్చిచంపాడు. 
 
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రానిప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచాల్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనికి నెగిటివ్‌ తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments