Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుపై శునకం కూర్చొందనీ... తుపాకీతో కాల్చి చంపిన కసాయి

Webdunia
గురువారం, 14 మే 2020 (12:00 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తాను ఎంతో ఇష్టపడి కనుక్కొన్న కారుపై ఓ కుక్క కూర్చొంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ కారు యజమానికి పట్టరాని కోపం వచ్చింది. అంతే.. తనవద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దుశ్చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని రానిప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బహుళ అంతస్తు భవన సముదాయంలో జిగర్‌ పంచాల్‌ (35) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈయన ఎంతో ఇష్టపడి ఓ కారును కొనుగోలు చేసి, ఆ ప్రాంగణం వెలుపల పార్కింగ్ చేశాడు.
 
అయితే, ఓ వీధి శునకం ఆ కారుపై కూర్చొంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. దీన్ని చూసిన పంచాల్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తన వద్ద ఉన్న తుపాకీతో కుక్కపై గురిపెట్టి కాల్చిచంపాడు. 
 
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రానిప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచాల్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనికి నెగిటివ్‌ తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments