Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుపై శునకం కూర్చొందనీ... తుపాకీతో కాల్చి చంపిన కసాయి

Webdunia
గురువారం, 14 మే 2020 (12:00 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తాను ఎంతో ఇష్టపడి కనుక్కొన్న కారుపై ఓ కుక్క కూర్చొంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ కారు యజమానికి పట్టరాని కోపం వచ్చింది. అంతే.. తనవద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దుశ్చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని రానిప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బహుళ అంతస్తు భవన సముదాయంలో జిగర్‌ పంచాల్‌ (35) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈయన ఎంతో ఇష్టపడి ఓ కారును కొనుగోలు చేసి, ఆ ప్రాంగణం వెలుపల పార్కింగ్ చేశాడు.
 
అయితే, ఓ వీధి శునకం ఆ కారుపై కూర్చొంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. దీన్ని చూసిన పంచాల్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తన వద్ద ఉన్న తుపాకీతో కుక్కపై గురిపెట్టి కాల్చిచంపాడు. 
 
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రానిప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచాల్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనికి నెగిటివ్‌ తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments