Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుపై శునకం కూర్చొందనీ... తుపాకీతో కాల్చి చంపిన కసాయి

Webdunia
గురువారం, 14 మే 2020 (12:00 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తాను ఎంతో ఇష్టపడి కనుక్కొన్న కారుపై ఓ కుక్క కూర్చొంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ కారు యజమానికి పట్టరాని కోపం వచ్చింది. అంతే.. తనవద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దుశ్చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని రానిప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బహుళ అంతస్తు భవన సముదాయంలో జిగర్‌ పంచాల్‌ (35) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈయన ఎంతో ఇష్టపడి ఓ కారును కొనుగోలు చేసి, ఆ ప్రాంగణం వెలుపల పార్కింగ్ చేశాడు.
 
అయితే, ఓ వీధి శునకం ఆ కారుపై కూర్చొంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. దీన్ని చూసిన పంచాల్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తన వద్ద ఉన్న తుపాకీతో కుక్కపై గురిపెట్టి కాల్చిచంపాడు. 
 
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రానిప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచాల్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనికి నెగిటివ్‌ తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments