Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపుడైనా అయోధ్య తీర్పు... యూపీకి కేంద్ర బలగాలు

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (13:12 IST)
కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతకంగా ఉన్న అయోధ్య సమస్యకు ఏ క్షణమైనా పరిష్కారం లభించనుంది. అయోధ్యలోని రామమందిరం - బాబ్రీ మసీదు స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏ రోజైనా తుది తీర్పును వెలువరించే అవకాశం ఉంది. 
 
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అదేసమయంలో అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. 
 
ఇందులోభాగంగా, యూపీకి భారీ ఎత్తున పారా మిలిటరీ బలగాలను తరలిస్తోంది. ఇందుకోసం రాష్ట్రానికి 15 కంపెనీల అదనపు పారా మిలిటరీ దళాలను పంపించనుంది. 
 
అలాగే, ఈ నెల 11న ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలకు చెందిన సాయుధ బలగాలను యూపీకి పంపించనున్నారు. ఈ బలగాలను సున్నిత ప్రాంతాలైన వారణాసి, కాన్పూర్, ఆజంఘడ్, అలీఘర్, లక్నో తదితర 12 ప్రాంతాల్లో మోహరింపజేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం