Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, రూ.3.20లక్షలు గోవిందా!

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (15:24 IST)
ఆగ్రాలోని బఝేరా ప్రాంతం అచ్నేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సుమారు యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్ళారు. ఈ ఘటనపై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. బఝేరా ప్రాంతానికి నివసిస్తోన్న కేలాల్, అతడి కుమారుడు లవకుష్ రాత్రివేళ ఇంటి బయట వరండాలో నిద్రపోయారు. అయితే పడుకునే ముందు వారు అనుకోకుండా ఇంటి తలుపులకు తాళం వెయ్యడం మర్చిపోయారు. 
 
ఇదే అదనుగా చేసుకున్న దొంగలు.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి.. అల్మారాలో ఉన్న సుమారు యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఇక తెల్లారి లేచి చూసేసరికి.. గది తలుపులు తెరిచి ఉండటాన్ని తండ్రీకొడుకులు గుర్తించారు. 
 
లోపలికి వెళ్లి చూడగా అరలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments