Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అగ్నిపథ్' స్కీమ్‌పై తీవ్ర ఆందోళనలు.. జన శతాబ్ధిని కదలనివ్వలేదు

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (15:42 IST)
కేంద్రం ప్రకటించిన 'అగ్నిపథ్' స్కీమ్‌పై తీవ్ర విమర్శలు, ఆందోళనలు అధికమవుతున్నాయి. రక్షణ శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ నియమాకాలపై కేంద్రం ప్రవేశపెట్టిన ఈ అగ్నిఫథ్ స్కీమ్‌పై యువత మండిపడుతోంది. 
 
అగ్నిపథ్ స్కీమ్ కింద రక్షణ శాఖ సర్వీసుల్లో చేరే యువత నాలుగేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తారు. మిగతావారికి రూ.12 లక్షల ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగం నుంచి పంపిస్తారు. 
 
వీరికి ఫించన్ సౌకర్యం ఉండదు. కేంద్రం ప్రకటించిన ఈ స్కీమ్ యువతలో ఆగ్రహావేశాలను రగిలించింది. ఇలాంటి రిక్రూట్‌మెంట్ పాలసీలు యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కేవలం నాలుగేళ్ల కాల పరిమితితో యువకులను ఉద్యోగాల్లోకి తీసుకోవడమంటే.. వారి భవిష్యత్తును బలిపెట్టడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
కేంద్రం ప్రకటించిన ఈ స్కీమ్‌ పట్ల యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా బీహార్ యువత ఈ స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. రోడ్లు, రైలు పట్టాల పైకి చేరి నిరసన తెలియజేశారు.
 
పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శరన్ జిల్లాలోని ఛప్రా వద్ద నిరసనకారులు ఓ ప్యాసింజర్ రైలుకు నిప్పంటించారు. ఆరా రైల్వే స్టేషన్ వద్ద నిరసనకారులు రాళ్లు రువ్వారు. బక్సర్ జిల్లాలో దాదాపు 100 మంది యువత రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి రైలు పట్టాలపై బైఠాయించారు. జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాల పాటు అక్కడినుంచి కదలనివ్వలేదు.
 
పాట్నా రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన నిరసనకారులు రోడ్డుపై వాహనాల టైర్లకు నిప్పంటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments