అమ్మ అకౌంట్లోకి ప్రతినెలా జమ అవుతున్న నగదు..

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (10:55 IST)
తమిళనాడు సీఎం జయలలిత మరణించి రెండేళ్లు గడిచినా... ఆమె బ్యాంకు ఖాతాలో మాత్రం నగదు తరగట్లేదు. జయలలిత బ్యాంక్ అకౌంట్లో క్రమం తప్పకుండా ప్రతినెలా నగదు జమ అవుతోందని ఐటీ అధికారులు తెలిపారు. జయ సొంత భవనాల్లో నివసిస్తున్నవారు.. దుకాణాలు నడుపుతున్నవారు.. అద్దెలను అమ్మ అకౌంట్లోకి ప్రతినెల జమచేస్తున్నారని ఐటీ అధికారులు తెలిపారు. 
 
జయకు చెందిన చెన్నై మందవల్లి, అన్నాశాలైలోని కొన్ని భవనాలు అద్దెకు వదలడం జరిగింది. వీటి నుంచి జయలలిత అకౌంట్‌ను భారీ మొత్తాన నగదు జమ అవుతుందని ఐటీ తెలిపింది. కాగా జయలలిత రూ.16.74 కోట్లకు పైగా ఆస్తిపన్నులు చెల్లించని కారణంగా ఆమెకు చెందిన 4 స్థిరాస్తులను అటాచ్‌ చేసినట్లు ఇటీవల హైకోర్టులో ఐటీ శాఖ నివేదికను సమర్పించారు. 
 
ఆమె ఖాతాలలో నగదును జమచేస్తున్నవారి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2016, డిసెంబరు 5న ఆమె మృతి చెందేనాటికే ఆమె చెల్లించాల్సిన ఆస్తి పన్నులు రూ.20 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. జయ అధికారిక వారసులెవరనే విషయం తేలకపోవడంతో ఐటీకి జయ తరఫు ఆస్తిపన్నులను ఇప్పటికిప్పుడు ఎవరూ చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి- 4K డాల్బీ అట్మాస్‌తో శివ రీ రిలీజ్.. నాగార్జున ప్రకటన

Dude: ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా ఫిల్మ్ డ్యూడ్ నుంచి బాగుండు పో రిలీజ్

Itlu Mee Edava : ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్ విడుదల.. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలు.. రెండు వారాల పాటు విశ్రాంతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments