Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రాన్ని ఆశ్రయించనున్న వొడాఫోన్.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (17:12 IST)
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ కేంద్రాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. లైసెన్సు ఫీజుల బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రతికూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రాన్ని ఆశ్రయించాలని వొడాఫోన్ ఐడియా నిర్ణయించుకుంది.
 
వడ్డీలు, పెనాల్టీలు మొదలైనవి తొలగించడం సహా ఊరట చర్యలు తీసుకోవాలని టెలికాం శాఖ (డాట్)ను కోరాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. డాట్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే టిలికాం కంపెనీలు లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ.21,000 కోట్లు కట్టాల్సి ఉంది.
 
ఇదిలా ఉంటే, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్ఎల్) తన చందాదారులకు అద్భుత ఆఫర్‌ తీసుకొచ్చింది. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్‌ ప్లాన్‌పై 90 రోజులు అదనంగా ఫ్రీ డేటా అందించనుంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తించనున్నట్లు సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments