Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిగిన బీజేపీ సీనియర్లు.. పార్టీకి నటి విజయశాంతి టాటా

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (08:54 IST)
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ బీజేపీ నేతలు అలిగారు. ముఖ్యంగా, పార్టీలో సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న తమను కాదని నిన్నామొన్నా పార్టీలో చేరిన వారిని ప్రోత్సహించడాన్ని, పదవులు కట్టబెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీని వీడాలని వారు భావిస్తున్నారు.
 
ముఖ్యంగా, టీఎస్ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి, మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ మహిళా నేత డీకే అరుణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ నేత ఈటెల రాజేందర్‌కు ప్రచార కమిటీ అధ్యక్ష పదవిని ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలైన సినీ నటి విజయశాంతి, మాజీ మంత్రి గడ్డం వివేక్, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, విఠల్, రవీంద్రనాయక్, దేవయ్య ప్రశ్నిస్తున్నారు. అందుకే వీరింతా కలిసి జితేందర్ రెడ్డి ఇంట్లో కీలక సమావేశం నిర్వహించారు. కొద్దిరోజులుగా కేంద్ర నాయకత్వం మీద గుర్రుగా ఉన్న వీరు ఈ భేటీతో బీజేపీని వీడతారా అంటూ ప్రచారం ఊపందుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments