Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కస్తూరీ ఫైర్.. చెర్రీ ట్వీట్ వైరల్

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (15:03 IST)
సనాతన ధర్మాన్ని రద్దు చేయాలంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నటి, సామాజిక కార్యకర్త కస్తూరి ఉదయనిధి స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. 
 
"మీ కుటుంబంలో డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందుతాయి. మీరు వాటితో ఏమి చేయాలనుకుంటున్నారు? సనాతనపై అంత ద్వేషం ఉన్నవారికి, హిందూ దేవాలయాల ఆస్తుల్లో పనేంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
సనాతన వ్యతిరేకతలో భాగమైన డీఎంకే ముందుగా ఇండియా కూటమి నుంచి వైదొలగాలి. ఎందుకంటే చాలామంది సనాతన వాదులు ఆ కూటమిలో ఉన్నారంటూ కస్తూరి గుర్తు చేశారు. 
 
ఇంకా ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తోంది. పలు చోట్ల ఉదయనిధి స్టాలిన్‌పై కేసులు కూడా పెట్టారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో హిందూవాదులు సైతం ఉదయనిధి స్టాలిన్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.
 
తన తల్లి సురేఖ కొణిదెల ఇంట్లో తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫొటోను ట్వీట్ చేసిన రామ్ చరణ్.. "మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత" అని పేర్కొన్నారు. 2020 సెప్టెంబర్ 11న చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments