Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాల వద్ద రూ.లక్షన్నర మోసం చేసిన వాలంటీర్...

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (14:16 IST)
వెస్ట్ గుంటూరు జిల్లాలో ఒక వాలంటీరు హిజ్రాల లక్షన్నర రూపాయలు తీసుకుని పారిపోయాడు. రూ.2 వేల నోట్లు మార్చి ఇస్తామని నమ్మించి ఈ మోసానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంతకాలంగా సదరు వాలంటీరు హిజ్రాలతో చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో రూ.2 వేల నోట్లు ఉంటే తనకివ్వాలని, బ్యాంకులో తనకు తెలిసిన వారు ఉన్నారని, వారు ఎంతైనా మారుస్తారని హిజ్రాలను నమ్మించాడు. 
 
వాలంటీర్ మాటలు నమ్మిన హిజ్రాలు రూ.3 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు ఇచ్చారు. ఆ నోట్లను మార్చి వారికి రూ.3 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ నెలాఖరుతో రూ.2 వేల నోట్లు మార్పిడి చేసుకునే గడువు ముగియడంతో మరోసారి రూ.లక్షన్నర విలువైన రూ.2 వేల నోట్లు వలంటీరు అందించారు. దీంతో రూ.లక్షన్నర పెద్ద నోట్లతో సదరు వలంటీర్ హైదరాబాద్ ఉడాయించాడు. 
 
ఈ విషయం తెలుసుకుని కొందరు హిజ్రాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. అతడిపై స్థానిక పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదిచ్చినట్లు హిజ్రాలు తెలిపారు. వాలంటీర్ వ్యవహారం బయటకు పొక్కితే ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమోనని కొందరు అధికార పార్టీ నాయకులు కావాలనే ఈ ఉదంతాన్ని కప్పిపెడుతున్నట్లు స్థానికులు చెప్పుకొంటున్నారు. పరారీలో ఉన్న వాలంటీర్‌‍ను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధిత హిజ్రాలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments