ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (19:39 IST)
తమిళనాడు - కేరళ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్నాటక చామరాజనగర జిల్లా హోసూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు అనునాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అటవీశాఖ అధికారులు పులులకు విషం పెట్టి చంపిన ఓ వ్యక్తితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటకకు చెందిన మదురాజు అనే వ్యక్తి తన ఆవును పులివేటాడి చంపినందుకు ప్రతీకారంగా అక్కడ తిరిగే పులులకు విషం పెట్టినట్టు అధికారులు వెల్లడించారు.
 
తాము ఎంతో అపురూపంగా  పెంచుకుంటున్న కెంచి అనే ఆవును ఇటీవల అడవిలో ఓ పులి వేటాడి చంపడంతో తీవ్ర ఆవేదనకు గురైన మాదురాజు ఎలాగైన అడవిలోని క్రూరమృగాలను చంపాలని పథకం వేశాడని అధికారులు తెలిపారు. అతడి స్నేహితులు కోనప్ప, నాగరాజుల సహాయంతో చనిపోయిన తన ఆవు కళేబరంపై విష చల్లి, దానిని అడవికి సమీపంలో పడేసినట్టు తెలిపారు. 
 
ఈ విష కళేబరాన్ని తిన్న ఓ తల్లి పులి, నాలుగు కూనలు ప్రాణాలు కోల్పోయాయని తెలిపారు. దీంతో మాదురాజుని అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం మీణ్యం ప్రాంతంలోని అరణ్య భవన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధారమయ్యా ఈ ఘటనపై పూర్తి నివేదిక అందిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments