Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూర్‌లో 3 వేలమంది కరోనా రోగులు పరారీ

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (09:44 IST)
కరోనా నుంచి ప్రజల్ని కాపాడడమెలా అని మదనపడుతున్న అధికారులకు సరికొత్త తలనొప్పి ఎదురవుతోంది. అనేక మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారు కనిపించకుండా పోతున్నారు. వారిని పట్టుకోవడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇప్పుడు ఈ సమస్య బెంగుళూరు అధికారులను పట్టుకుంది.

కరోనా వైరస్‌ సోకిన 3,338 మంది బెంగళూర్‌లో కనిపించకుండా పోయారు. బెంగళూర్‌లో గత రోజుల వ్యవధిలోనే 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం కేసుల్లో ఏడు శాతం మంది కనిపించకుండా పోవడం అధికారుల్లో ఆందోళనలను పెంచుతుంది.

వీరిని త్వరగా పట్టుకోలేకపోతే వీరి ద్వారా మరింత మందికి కరోనా విస్తరించే అవకాశముంది. తాము చాలా ప్రయత్నించినప్పటికీ వారి జాడ కనిపెట్టలేకపోయామని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

పరీక్షల కోసం శాంపిల్స్‌ ఇచ్చే సయమంలో కొంతమంది తప్పుడు మొబైల్‌ నెంబర్‌, తప్పుడు అడ్రస్‌ ఇచ్చారని, పాజిటివ్‌ వచ్చిందని వారికి తెలియగానే వారు కనిపించకుండా పోయారని కమిషనర్‌ మంజూనాథన్‌ ప్రసాద్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments