ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ సేన్ ఇకలేరు... గుండెపోటుతో మృతి

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (11:14 IST)
ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 72 యేళ్లు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆ వెంటనే ఆయన్ను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే కన్నుమూసినట్టు ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ వెల్లడించారు. 
 
కాగా, అభిజిత్ సేన్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఛైర్మన్‌తో పాటు పలు కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. 
 
ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు అభిజిత్ సేన్ ప్రణాళికా సంఘం సభ్యుడిగా విశేష సేవలు అందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎంతో పట్టుకలిగిన అభిజిత్ సేన్ మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments