Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానం ఎక్కాలనుకునేవారు ఇది ఓసారి చూడాల్సిందే

Webdunia
గురువారం, 21 మే 2020 (17:45 IST)
కొవిడ్-19 కారణంగా భారత్‌లో అన్ని రవాణా సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అయితే దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు ప్రజారవాణాకు అనుమతి లభించడంతో రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి, అలాగే దేశీయంగా నడిచే విమానాలు కూడా గాలిలోకి ఎగరనున్నాయి.

కాగా ఆరోగ్యసేతు యాప్‌లో మీ స్టేటస్ చాలా ముఖ్యం. ఒకవేళ అందులో రెడ్ స్టేటస్ చూపినట్లయితే, అప్పుడు మీరు విమానంలో ప్రయాణించలేరు. ఆరోగ్య‌సేతులో రెడ్ స్టాట‌స్ ఉన్న‌వారిని విమాన ప్ర‌యాణానికి అనుమ‌తించ‌మ‌ని విమాన‌యాన‌శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పూరి తెలిపారు.
 
మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు మంత్రి ప్రకటించారు. మెట్రో నుంచి మెట్రో న‌గ‌రాల‌కు మూడ‌వ వంతు సామ‌ర్థ్యంతో విమాన స‌ర్వీసులు న‌డ‌పనున్న‌ట్లు తెలిపారు. ఆ ప్రకారం ప్ర‌యాణికుల శాతం 33.33 క‌న్నా ఎక్కువే ఉంటుంది. విమాన ప్ర‌యాణికులు తప్పనిసరిగా ప్రొటెక్టివ్ గియ‌ర్‌, ఫేస్ మాస్క్‌, శానిటైజ‌ర్ బాటిల్‌ను తీసుకెళ్లాలన్నారు. 
 
ఎయిర్‌లైన్స్ ఎలాంటి మీల్స్ ఏర్పాటు చేయ‌ద‌న్నారు. అలాగే గ్యాల‌రీలో, విమాన సీట్ల‌లో వాట‌ర్ బాటిల్స్ ఉంటాయ‌న్నారు. విమాన ఛార్జీల ధ‌ర‌ల్లో మార్పు ఉంటుంద‌న్నారు. క‌నీస ధ‌ర రూ.3500, గ‌రిష్ట ధ‌ర 10 వేలుగా ఉంటుందని నిర్ధారించారు. ఆగ‌స్టు 24 అర్థ‌రాత్రి వర‌కు ఈ ఛార్జీలు అమ‌లులో ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments