Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 మందిని పెళ్లాడిన యువతి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:03 IST)
తన మాయమాటలతో యువకులకు గాలం వేసి పెళ్లాడడం.. ఆపై నగదు, నగలతో పరారు కావడం.. భాగ్‌వతి అలియాస్‌ అంజలికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఇప్పటి వరకు ఒకరి తరువాత ఒకరిని ఏకంగా 18 మందిని పెళ్లాడి వారిని మోసం చేసింది.

చివరికి రాజస్తాన్‌ పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. తెలుగు రాష్ట్రాలకు చెందినట్టుగా భావిస్తున్న అంజలి మరో ఐదుగురితో కలిసి గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో పలువురిని మోసగించింది. జునాగఢ్‌ పరిధిలో ఉండే అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడిన అంజలి.. నగలు, రూ.3 లక్షల నగదుతో పరారైంది.

తాను మోసపోయినట్టు తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంజలి బాగోతం బయటకు వచ్చింది. మారు పేరు, నకిలీ ధ్రువపత్రాలతో ఆమె గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

అంజలితోపాటు మరో ఐదుగురిని కటకటాల వెనక్కి పంపారు. విచారణలో ఆమె 18 మంది యువకులను పెళ్లాడినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments