Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల కట్టలు దాచుకోవడానికి భవనాలా: మాజీమంత్రిపై చెప్పు విసిరిన మహిళ

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (11:17 IST)
మాజీ మంత్రి పార్థా ఛటర్జీ పైకి ఓ మహిళ చెప్పు విసిరింది. ఈడీ కేసులో చిక్కిన పార్థా ఛటర్జీని మంగళవారం నాడు ఆసుపత్రిలో పరీక్షలు చేయించి బయటకు తీసుకువస్తున్న సమయంలో ఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో తన కాలికి వున్న చెప్పును తీసి అతడిపైకి విసిరింది. తమ బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతుంటే మీలాంటివారు కోట్లకు కోట్లు వెనకేసుకుని ఆ డబ్బంతా దాచుకునేందుకు భవనాలు కడతారా అంటూ చెప్పు విసిరింది.

 
ఐతే ఆ చెప్పు గురి తప్పడంతో పార్థా ఛటర్జీ పక్కన పడింది. ఈ పరిణామంతో అక్కడున్నవారు షాకయ్యారు. వెంటనే మాజీమంత్రిని అక్కడి నుంచి తరలించారు. కాగా రాష్ట్రంలో తనలానే ప్రజలు ఆగ్రహంతో వున్నారని ఆమె చెప్పారు. అతడిపైకి విసిరిన చెప్పున మళ్లీ ధరించబోనని ఆమె వెల్లడించారు.

 
పార్థా ఛటర్జీకి సంబంధించి ఇప్పటివరకూ రూ. 50 కోట్ల మేర నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. పార్థాతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments